నటుడు నరేష్( Actor Naresh ) గురించి అందరికీ తెలుసు ఆయన అతు హీరో గా చాలా సినిమాలు తీసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చాలా సినిమాల్లో నటిస్తున్నాడు…అయితే నరేష్ గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ గా ‘మళ్ళీ పెళ్లి’ చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే.పవిత్ర లోకేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.
ఎస్.రాజు దర్శకుడు.‘విజయ కృష్ణ మూవీస్ బ్యానర్’ పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.అనన్య నాగళ్ళ, అన్నపూర్ణ,వనిత విజయ్ కుమార్ వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.
మే 26న ఈ మూవీ విడుదల కానుంది.టీజర్, ట్రైలర్ వంటివి జనాల్లో ఆసక్తిని రేకెత్తించాయి.
ఎందుకంటే ఇది నరేష్ – పవిత్ర ల జీవితంలోని సంఘటనలు ఆధారం చేసుకుని తీసిన కథ అని ప్రోమోలు స్పష్టం చేశాయి.
మరీ ముఖ్యంగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి( Ramya Raghupathi ) పై రివేంజ్ తో తీసిన సినిమాలా కూడా అనిపిస్తున్నట్లు అంతా భావిస్తున్నారు.ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది.ఒకసారి బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను గమనిస్తే : నైజాం 0.48 cr సీడెడ్ 0.26 cr ఆంధ్ర 0.55 cr ఏపీ+ తెలంగాణ టోటల్ 1.29 cr రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.20 cr వరల్డ్ వైడ్ టోటల్ 1.49 cr
‘మళ్ళీ పెళ్లి’ (Malli Pelli) చిత్రానికి రూ.1.49 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.కొన్ని చోట్ల ఓన్ రిలీజ్ చేసుకున్నారు.సో బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.1.75 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.టాక్ పాజిటివ్ గా వస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అవలీలగా చేరుకుంటుంది.లేదంటే.కష్టం.తొలి రోజు అయితే మినిమమ్ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశం ఉంది…
.