ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సెలబ్రిటీల్లో నరేష్ మరియు పవిత్ర లోకేష్ గురించి ఎక్కువగా మీడియా లో కథనాలు వస్తున్న విషయం తెల్సిందే.మళ్లీ పెళ్లి సినిమా తో( Malli Pelli Movie ) వీరు ఇద్దరు రాబోతున్నారు.
త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో నరేష్( Naresh ) మరియు పవిత్ర( Pavitra Lokesh ) కలిసి సందడి చేస్తున్నారు.తాజాగా ఓంకార్ షో లో వీరిద్దరు పాల్గొన్నారు.
మళ్లీ పెళ్లి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది.నరేష్ యొక్క జోరు మామూలుగా లేదు.
పవిత్ర ను తాను ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్పకనే చెప్పాడు.
తాజాగా షో లో పవిత్ర లోకేష్ కు ముద్దు పెట్టడంతో పాటు పలు రకాలుగా మాట్లాడుతూ తాము ఇద్దరం పెళ్లి చేసుకున్నట్లుగా చెప్పకనే చెప్పాడు.లోకేష్ – పవిత్ర జోడీకి సంబంధించిన విషయాల గురించి కొన్ని పుకార్లు ఉన్నాయి.తాజాగా ఆ పుకార్లు అన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పడుతుంది.
హీరోగా నరేష్ నటించగా కీలక పాత్రలో పవిత్ర లోకేష్ నటించింది.ఇద్దరు కూడా ప్రస్తుతం సహజీవనంలో ఉన్నారు.
ఇద్దరికి ఇద్దరు కూడా తమ జీవితాల్లో మోసపోయారు.
ఇప్పుడు ఒకరిని ఒకరు నమ్మి జీవితంలో ముందుకు సాగుతున్నారు.తాజాగా మళ్లీ పెళ్లి సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓంకార్ షో లో మాట్లాడుతూ నువ్వు నన్ను నమ్మాల్సిందే.ఎందుకంటే నీకు మరో ఆప్షన్ లేదు.
జీవితాంతం నమ్మాల్సిందే అంటూ సరదాగా నరేష్ కామెంట్స్ చేశాడు.ఇద్దరి మధ్య అన్యోన్యతకు అది ప్రత్యక్ష సాక్ష్యం అన్నడంలో సందేహం లేదు.
మళ్లీ పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి మరిన్ని సినిమా ల్లో నటించే అవకాశాలు ఉన్నాయి.జీవితాంతం కూడా కలిసి ఉండాలని కోరుకుంటున్న వీరిద్దరు ఎంత వరకు కలిసి ముందుకు నడుస్తారు అనేది చూడాలి.