1.రేవంత్ రెడ్డి ముఖం చూడను : కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ఇకపై రేవంత్ రెడ్డి ముఖం చూడనని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
2.రేవంత్ రెడ్డి సవాల్
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో బహిరంగ చర్చ కు సిద్దమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
3.మావోయిస్టుల వారోత్సవాల ముగింపు సభ
తెలంగాణ ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో మావోయిస్టుల వారోత్సవాలు ముగింపు సభ జరిగింది.ములుగు జిల్లా వెంకటాపురం , వాజేడు, దండకారణ్యం అటవీ ప్రాంతంలో జరిగింది.
4.చుండూరులో కాంగ్రెస్ బహిరంగ సభ
నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం చుండూరులో ఈరోజు కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించనుంది.
5.నేడు ఢిల్లీకి బండి సంజయ్
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నేడు ఢిల్లీకి వెళ్ళనున్నారు.ఈ మేరకు తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు.
6.ఐ ఐ టీ హైదరాబాద్ లో ఎంఎస్సీ మెడికల్ ఫిజిక్స్
హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి కలిసి మెడికల్ ఫిజిక్స్ లో ఎంఎస్సీ కోర్సు ప్రారంభించాయి.
7.గిరిజన ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఇస్లావత్ రామ్ చందర్ నాయక్
నల్గొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడిగా ఉన్న ఇస్లావత్ రామ్ చందర్ నాయక్ ను తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్ధికాభివృద్ది సంస్థ చైర్మన్ గా సీఎం కేసీఆర్ నియమించారు.
8.‘ నేతన్న భీమా ‘ లో మార్పులు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేతన్న భీమా పథకం అందరికీ వర్తించే పరిస్థితి ఉందని అందువల్ల విధివిధానాలు మార్పులు చేయాలని పద్మశాలి సంఘం చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరారు.
9.నేడు కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్త ధర్నాలు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైకిరికి నిరసనగా ఏఐసిసి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నాలు చేపట్టింది.
10.ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం
అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని బిఎస్పి తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
11.విద్యుత్ బిల్లును ప్రవేశపడితే మెరుపు సమ్మె
విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెడతే అదే రోజు మెరుపు సమ్మెకు దిగాలని తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ జేఏసీ నిర్ణయించింది
12.9 నుంచి 21 వరకు స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు
భారత స్వతంత్ర వజ్రోత్సవ ద్విశప్తాహం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆగస్టు 9 నుంచి 21 వరకు రవీంద్రభారతిలో పలు సాంస్కృతిక సాహిత్య నృత్య కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు స్వతంత్ర వజ్రోత్సవ కమిటీ చైర్మన్ కేశవరావు తెలిపారు.
13.హైకోర్టు న్యాయమూర్తిగా విజయభాస్కర్ రెడ్డి ప్రమాణం
హైకోర్టు ఐ మూర్తిగా జస్టిస్ చాలా విజయభాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు
14.జగన్ పై కేఏ పాల్ కామెంట్స్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రానున్న ఎన్నికల్లో తనతో కలవకపోతే ఆయనే తీవ్రంగా నష్టపోతారని శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
15.విశాఖలో వంగపండు విగ్రహావిష్కరణ
ప్రజా గాయకుడు రచయిత దివంగత వంగపండు ప్రసాద్ విగ్రహాన్ని విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ రోడ్ లో ఏర్పాటు చేశారు.
16.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,35,364 కరోనా పాజిటివ్ కేసులను నమోదు అయ్యాయి.
17.బండి సంజయ్ కామెంట్స్
కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిజెపితో టచ్ లో ఉన్నారని తాను అనలేదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
18.తెలంగాణ లో కరోనా
గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 43,318 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
19.గోరంట్ల మాధవ్ వీడియో పై విచారణ
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విచారణ జరిపిస్తుందని ఆయనది తప్పని తెలిస్తే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,650 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,980
.