ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ, ప్రతి పక్ష టీడీపీ పార్టీల మధ్యలో పోరు మాటలు దాటి.దాడుల వరకు వెళ్లింది.
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి.ఏకంగా వైసీపీ ఎమ్మెల్యే, తెలుగు దేశం మాజీ ఎమ్మెల్సీ మధ్య ఘర్షణకు దారి తీసింది.
మాజీ మంత్రి చేసిన కామెంట్స్ కు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడించేందుకు ఎమ్మెల్యే జోగి అక్కడికి చేరుకోవడం ఉద్రికత్త పరిస్థితి నెలకొంది.
ఈ ఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
అప్రమత్తమైన పోలీసులు సీఎం జగన్ ఇంటి వద్ద భారీ భద్రత పెంచారు.టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు చేసే అవకాశం ఉన్నందున పోలీసులు భద్రత పెంచారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటిని ఎలా ముట్టడించారో సీఎం జగన్ ఇంటిని కూడా మీము ముట్టడిస్తామని తెలుగు తమ్ములు హెచ్చరించడంతో పరిస్థితి ఉద్రికత్తకు దారి తీసింది.
ఈ సంఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుపడ్డారు.
వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్తో పాటు సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ప్రతి పక్ష నాయకుడి ఇంటిపైకి నీ గుండాలను పంపించడాన్ని చూస్తే దిగజారుడుతనం అర్థమౌతుందని ట్వీట్లర్ వేదికగా విరుచుకుపడ్డారు.సీఎం జగన్ ప్రవర్తన చూస్తే పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టు కనిపిస్తుందని ఘాట్గా స్పందించారు.
సీఎం గజన్ మోహన్రెడ్డి ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు తెలిపోయాయని, జగన్ది అంతా నాటకమనే విషయం ఏపీ ప్రజలకు తెలిసిపోయిందన్నారు.రౌడిల ప్రతి పక్ష నాయకుల ఇండ్లపైకి తన చెంచాలను పంపిస్తున్నారని ధ్వజమెత్తారు.జగన్ క్రూర నేర స్వభావం కలవారు అని, చంద్రబాబు ఎప్పుడు రౌడీ రాజకీయలు చేయలేదని చెప్పారు.
జగన్ పాలనపై జనం తిరుగబడే రోజు దగ్గర పడిందన్నారు.జగన్ తన రౌడీలను పతిపక్ష నేతల ఇండ్లమీదికి పంపడం లేదుకు? తానే స్వయంగా వస్తే బాగుంటుందన్నారు.