ఏపీ హైకోర్టులో నారా లోకేశ్ లంచ్ మోషన్ పిటిషన్లు

టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు.ఒకటి ఏపీలోని ఫైబర్ నెట్ కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు.

 Nara Lokesh Lunch Motion Petitions In Ap High Court-TeluguStop.com

ఈ మేరకు లోకేశ్ పిటిషన్ పై మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేపట్టనుంది న్యాయస్థానం.ఫైబర్ గ్రిడ్ తో తనకు సంబంధం లేదని, తనను అకారణంగా ఆ కేసులో ఇరికించారని పిటిషన్ లో పేర్కొన్నారు.మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 41 ఏ నోటీసుల్లో కొన్ని నిబంధనలను సవాల్ చేసిన లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారు.

హెరిటేజ్ పుడ్స్ నుంచి తాను ఎప్పుడో బయటకు వచ్చానన్న ఆయన తానెలా సీఐడీ అడిగిన అకౌంట్ బుక్స్ తెస్తానంటూ పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు.కాగా ఈ పిటిషన్ పై కూడా మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టు విచారణ చేయనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube