అక్రమ అరెస్టుతో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు గారికి సంఘీభావంగా ఢిల్లీలో నిర్వహించిన “కాంతితో క్రాంతి“ కార్యక్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు.
లైట్లు ఆపి, కొవ్వొత్తులు వెలిగించి వైకాపా సర్కారు తీరుపై నిరసన తెలిపారు.
సేవ్ ఏపి… సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు ఇచ్చారు.ఈ నిరసన కార్యక్రమానికి వైసిపి ఎంపి రఘురామకృష్ణంరాజు మద్దతు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.