అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేశ్..!!

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్న ఏపీ సీఐడీ అధికారులు టీడీపీ నేత నారా లోకేశ్ ను ఏ14 గా పేర్కొన్నారు.

 Nara Lokesh As A14 In Amaravati Inner Ring Road Case..!!-TeluguStop.com

ఈ క్రమంలోనే విజయవాడలోని ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు.ఈ మెమోలో ఈ విషయాన్ని సీఐడీ ప్రస్తావించింది.

ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మాజీమంత్రి నారాయణ, లింగమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలతో పాటు పలువురిని నిందితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే.అయిటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్ ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మార్పులు చేశారని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది.

దీనికి సంబంధించి గతేడాది ఏప్రిల్ లో సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube