నంద్యాల డీఈవో సంచలన ఉత్తర్వులు జారీ చేశారు.టీచర్లను పోలీస్ స్టేషన్ లో పెట్టాలంటూ డీఈవో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గత ఏడాది టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ కు సహకరించినట్లు ఎనిమిది మంది టీచర్లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షలు ముగిసే వరకూ ఎనిమిది మంది టీచర్లను పోలీస్ స్టేషన్ లో ఉంచాలని ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.మరోవైపు డీఈవో ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.