మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీతారామం.ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇకపోతే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో చిత్ర బృందం థాంక్యూ మీట్ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి అక్కినేని నాగచైతన్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.సీతారామం వంటి సినిమా చేయాలంటే ధైర్యం కావాలని, స్వప్న ప్రియాంకలు అశ్వినీ దత్ గారికి అండగా నిలుస్తున్నారని ఈయన తెలిపారు.
ఇక ఈ సినిమా చూస్తుంటే తనకు చాలా అసూయ కలిగిందని దుల్కర్ సల్మాన్ నటించిన ఈ పాత్రలో తాను నటించాల్సి ఉందని, అసలు నేను చేయాల్సిన రోల్ ఇది అంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయని అప్పట్లో తాను నటించినా గీతాంజలి, సంతోషం, మన్మధుడు వంటి సినిమాలు కళ్ళ ముందు కనపడ్డాయని నాగార్జున తెలిపారు.
ఈ విధంగా ఈ సినిమా థాంక్యూ మీట్ కార్యక్రమంలో భాగంగా సీతారామం సినిమా గురించి అందులో దుల్కర్ సల్మాన్ నటనపై ఈయన ప్రశంసలు కురిపిస్తూ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు నన్ను ఇంతగా ఆదరించినందుకు ప్రేక్షకులందరికీ ఆయన థాంక్యూ తెలియజేశారు.