అక్కినేని నాగచైతన్య( Akkineni Nagachaitanya ) సాయి పల్లవి( Sai Pallavi ) జంటగా నటించిన తాజా చిత్రం తండేల్( Thandel ).ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరింది.
ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో అక్కినేని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈ సినిమా సక్సెస్ వేడుకను హైదరాబాద్ లో నిర్వహించారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నాగార్జున( Nagarjuna ) పాల్గొని సందడి చేశారు.
ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ తన కొడుకు సినిమా ఇంత మంచి సక్సెస్ అయినందుకు చాలా సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సినిమా మొదటి రోజు మంచి టాక్ సొంతం చేసుకోవడంతో ఎంతో మంది అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు చేయటంతో నాగచైతన్య చాలా సంతోషపడ్డారని వెల్లడించారు.ఇక ఈ సినిమా కోసం చిత్ర బృందం మమ్మల్ని కలిసిన వేళా విశేషమో, లేకపోతే శోభితను( Sobhita ) పెళ్లి చేసుకున్న వేల విశేషమో తెలియదు కానీ నాగచైతన్య అద్భుతమైన విజయాన్ని అందుకున్నారని నాగార్జున తెలిపారు. ఇక అల్లు అరవింద్ గారు మాకు మూడు హిట్ సినిమాలను అందించారని తెలిపారు.

గీత ఆర్ట్స్ బ్యానర్ పై నాగచైతన్య నటించిన 100% లవ్, తండేల్ సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి.అలాగే అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా సక్సెస్ కావడంతో అక్కినేని అల్లు కాంబినేషన్ అద్భుతంగా సెట్ అయిందని నాగార్జున గుర్తు చేశారు.ఇక వేదికపై నాగార్జున మాట్లాడటానికి కంటే ముందుగా అక్కడ నాగార్జునకు సంబంధించి ఒక ఏవి విడుదల చేశారు అందులో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉండడంతో.దయచేసి నా కొడుకు కోడలి ముందు ఇలాంటి వీడియోలు వెయ్యకండయ్యా నవ్వులు పూయించారు.
ఇక ఈ కార్యక్రమానికి శోభిత( Sobhita ) కూడా హాజరైన విషయం తెలిసిందే.