టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో సమంత( Samantha ) ఒకరనే సంగతి తెలిసిందే.సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న ఈ హీరోయిన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తక్కువేం కాదు.
అయితే సమంత కొన్ని నెలల క్రితం వరకు మాజా యాడ్ లో కనిపించేవారు.ఈ యాడ్ ద్వారా సమంతకు ఊహించని స్థాయిలో క్రేజ్ సైతం పెరిగింది.
అయితే ప్రస్తుతం ఈ యాడ్ లో సమంతకు బదులుగా నాగ్, పూజా హెగ్డే( Pooja Hegde ) కనిపిస్తున్నారు.
సమంతకు నాగ్( Nagarjuna ) దిమ్మతిరిగే షాక్ ఇచ్చారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఈ యాడ్ ద్వారా సమంతపై నాగ్ పగ తీర్చుకున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.మరోవైపు వరుస ఫ్లాపుల నేపథ్యంలో నాగ్ కథల ఎంపికలో రూట్ మార్చారు.
తెలుగు నేటివిటీ కథలను ఎంచుకోవడానికి నాగార్జున ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం అందుతోంది.
నాగార్జున ప్రసన్న కుమార్ బెజవాడ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.ఈ సినిమాతో నాగ్ ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది.
నాగ్ రెమ్యునరేషన్ ఏకంగా 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.
నాగ్ మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటునారు.నాగ్ అఖిల్, చైతన్యలతో కలిసి సినిమాలు తీయాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబినేషన్ లో మళ్లీ ఎప్పుడు సినిమాలు వస్తాయో చూడాలి.టాలెంటెడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నాగ్ నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
కెరీర్ విషయంలో నాగార్జున జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలని తప్పటడుగులు వేయవద్దని ఫ్యాన్స్ సూచనలు చేస్తున్నారు.వివాదాలకు స్టార్ హీరో నాగార్జున దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.