యాదాద్రి భువనగిరి జిల్లా:రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri ) మోత్కూర్ కి చెందిన టీపీసీసీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా ఉన్న నాగరిగారి ప్రీతం ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 37 మంది కార్పొరేషన్ చైర్మన్లను నియమించగా ప్రీతంకు ఆ జాబితాలో చోటుదక్కింది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ( Rahul Gandhi ) అనుచరుడిగా ఉన్న ప్రీతం, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలలో కీలక పాత్ర పోషించడంతో పాటు పలు రాష్ట్రాల ఎన్నికల ఇంచార్జీగా పనిచేశారు.ఎన్.ఎస్.యు.ఐ,యూత్ కాంగ్రెస్ లో జాతీయ స్థాయిలో పనిచేసిన అనుభవం వుంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు,దళితుల హక్కుల కోసం ఆందోళనలు చేపట్టారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నప్పటికీ టిక్కెట్ రాలేదు.దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించింది.