దసరా పండుగ నేపథ్యంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అలయ్ బలయ్ కార్యక్రమం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు.ఏపాటి వారికైనా మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటే అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
అయితే, అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవితో అందరూ ఫోటోలు దిగుతూ ఉన్న సమయంలో గరికపాటి తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.ఈ క్రమంలో కొంత అసహనం వ్యక్తం చేసిన గరికపాటి చిరంజీవి తన ఫొటో సెషన్ ఆపేసి వచ్చి కూర్చోవాలని అని పదేపదే చెప్పడం, ఆయన వచ్చి కూర్చోవడం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.