టాలీవుడ్ లో వరుసగా మల్టీస్టారర్ సినిమాలు రాబోతున్నాయి.గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ముందు ముందు మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తుంది.
ఇటీవలే పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఒక సినిమా కన్ఫర్మ్ అయింది.ఫిబ్రవరి 14వ తారీఖున ఆ సినిమా అధికారికంగా పూజా కార్యక్రమాలు జరిపించుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.
మరో వైపు వెంకటేష్ మరియు రానా కలిసి ఒక సిరీస్ లో నటించారు.ఆ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇదే సమయం లో వెంకటేష్ మరియు నాగచైతన్య ఒక సినిమా లో నటించేందుకు ఓకే చెప్పారంటూ ప్రచారం జరుగుతుంది.
ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వెంకీ మామ అనే సినిమా విడుదలైంది.ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది.కనుక మరో సారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ మామ, అల్లుళ్ళు ప్రయత్నాలు చేయబోతున్నారట.
భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ సినిమా కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.సురేష్ బాబు ఈ సినిమా ను నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది.
అంతే కాకుండా నాగార్జున మరియు నాగ చైతన్య కలిసి కూడా ఒక సినిమా లో నటించబోతున్నారట.మొత్తానికి తెలుగు ప్రేక్షకులకు మల్టీ స్టారర్ సినిమాలు వరుసగా రాబోతున్న నేపథ్యం లో పండగే పండగ అంటూ ప్రేక్షకులు మరియు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.గతంలో వచ్చిన మాదిరిగానే ఎంటర్ టైన్మెంట్ ను అందించే విధంగా ఈ మల్టీ స్టారర్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సురేష్ బాబు కాంపౌండ్ నుండి సమాచారం అందుతోంది.సురేష్ బాబు ఈ మల్టీ స్టారర్ పై చాలా ఎక్కువ ఫోకస్ పెట్టాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.