మయన్మార్ విదేశీ సందర్శకులను( Mayanmar ) ఆకర్షించి దేశంలో వారి ఖర్చులను పెంచడం ద్వారా ఆర్థిక లాభం పొందాలని చూస్తోంది.ఈ ప్రయత్నంలో భాగంగా చైనీస్, భారతీయ పర్యాటకులకు వీసాలు అందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
వీసా ఆన్ అరైవల్ వెంటనే జారీ చేసే వన్-ఇయర్ ట్రయల్ స్కీమ్( One Year Trial Scheme ) త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.వీసా హోల్డర్లు భద్రతా కారణాల దృష్ట్యా నిషేధిత ప్రాంతాలలో మినహా అన్ని సైట్లను విజిట్ చేయవచ్చు.
ఇండియా, చైనా దేశాల పౌరులు టూరిస్ట్ వీసా కోసం ఆన్లైన్లో లేదా మయన్మార్ ఎంబసీలో అప్లై చేసుకోవచ్చు.

2021లో సైనిక తిరుగుబాటు వల్ల మయన్మార్ అన్ని విధాలా కుదేలయ్యింది.ఆ దెబ్బ నుంచి కోలుకునేందుకు దేశం కష్టపడుతోంది.మరోవైపు తిరుగుబాటు హింస, అస్థిరతకు దారితీసిందని మయన్మార్కు ప్రయాణాలు చేయకూడదని చాలా దేశాలు తమ పౌరులకు సలహా ఇచ్చాయి.
దాంతో టూరిజం నుంచి రెవెన్యూ బాగా తగ్గిపోయింది.కొనసాగుతున్న సంఘర్షణ ఉన్నప్పటికీ, మయన్మార్ పర్యాటక మంత్రిత్వ శాఖ దాని అతిపెద్ద వ్యాపార భాగస్వాములు అయిన చైనా, భారతదేశం నుండి పర్యాటకులను ఆకర్షించాలని భావిస్తోంది.
మయన్మార్కు మరో ప్రధాన మిత్రదేశమైన రష్యా నుంచి పర్యాటకులను ఆకర్షించేందుకు కూడా మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది.

దశాబ్దాల సైనిక పాలన తర్వాత 2011లో మయన్మార్ పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది.అయితే, మహమ్మారి, తిరుగుబాటు పర్యాటక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది.కొత్త వీసా ఆన్ అరైవల్ స్కీమ్( Visa on Arrival ) పర్యాటకాన్ని పునరుద్ధరించడానికి, ఆర్థిక వ్యవస్థను పెంచడానికి సహాయపడుతుందని దేశం ఆశిస్తోంది.
చైనా, భారతదేశం( Indian Tourists ) నుంచి పర్యాటకులు మయన్మార్లోకి ప్రవేశించడాన్ని సులభతరం చేస్తుంది కాబట్టి ఈ పథకం ప్రసిద్ధి చెందుతుందని భావిస్తున్నారు.అయితే, తిరుగుబాటు, మహమ్మారి నుంచి దేశం ఇంకా కోలుకుంటోందని, ఇంకా కొన్ని భద్రతా ప్రమాదాలు ఉన్నాయని గమనించడం ముఖ్యం.
మయన్మార్ను సందర్శించాలని నిర్ణయించుకునే ముందు ప్రయాణికులు ప్రమాదాలను జాగ్రత్తగా పరిశీలించాలి.







