గత ఏడాది విశాఖపట్నం( Visakhapatnam 0లో తనని పోలీసులు నిర్బంధించిన సమయంలో చంద్రబాబు అండగా నిలబడ్డారని పవన్ వ్యాఖ్యానించారు.విశాఖ గొడవలో చంద్రబాబు( Chandrababu Naidu ) తనకు మద్దతు తెలిపారు తిరిగి తాను స్పందించడం అనేది సంస్కారం అని వ్యాఖ్యానించారు.
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆయనను అరెస్టు చేసినట్లు తాను భావిస్తున్నట్లు పవన్( Pawan Kalyan ) చేశారు.నాకోసం నిలబడిన వ్యక్తికి మద్దతు తెలపటం మన బాధ్యత.
రెండేళ్లు జైలుకు వెళ్లిన వ్యక్తి జగన్.ఆయన రిచెస్ట్ ముఖ్యమంత్రి… కానీ ఏం చేశాడో తెలియదు.
జగన్( YS Jagan ) ప్రతి ఒక్కరిని నేరగాళ్ళుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అధికారంలోకి వచ్చాక వైసీపీ దొంగలను వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
యుద్ధం కావాలని కోరుకుంటే అందుకు మేము సిద్ధమే అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా( AP People ) మేలుకోవాల్సిన సమయం అని.వ్యాఖ్యానించారు.ప్రతి ఒక్కరికి అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు పిరికితనం నిండిపోయింది.
రాజకీయాలు ప్రశాంతంగా ఉంటాయని ఎప్పుడూ అనుకోవద్దు.జగన్ వైఖరి గురించి కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నా.
జీ20 లాంటి ప్రతిష్టాత్మకమైన సదస్సు దేశంలో జరుగుతున్న సమయంలో.ఈ రకంగా వైసిపి ప్రభుత్వం( YCP Govt ) వ్యవహరించటం అన్యాయమని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రజలందరూ మేల్కోవలసిన సమయం ఇది.తాను తుది శ్వాస వరకు జగన్ పై పోరాటం చేస్తానని పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేయడం జరిగింది.







