పవన్ కి ముద్రగడ లేఖ వెనుక భారీ స్కెచ్..

గత కొన్నిరోజులుగా పవన్ కళ్యాణ్ చేస్తున్న రగడ అంతా నిశితంగా పరిశీలిస్తే అసలు పవన్ కళ్యాణ్ గొడవ పెట్టుకోవడానికి మీడియా అధినేతలని తిట్టడానికి , నాకు అన్యాయం జరిగింది నా తల్లిని కాపాడుకోలేని నేను వ్యర్ధం చచ్చిపోతాను అని చెప్పడానికి అసలు బలమైన కారణాలు ఏమున్నాయి అని అందరూ ఆలోచించడం మొదలు పెట్టారు.

ఈ గొడవకి కారణం అయిన శ్రీ రెడ్డి సారీ అమ్మా అని చెప్పింది అయినా సరే పవన్ కళ్యాణ్ తన తల్లి విషయంలో ఇంత సీరియస్ గా ఉండటానికి ఈ గొడవని మరింతగా పెంచడానికి కారణం ఏమిటి అంటే రాజకీయ లబ్ది అని చాలా సులువుగా అర్థం అవుతోంది.

అందరిలాగా నేను రాజేకీయాలు చేయను అంటూ చెప్పే పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు చేస్తోంది ఏమిటి అంటూ అభిమానులు సైతం చర్చించుకుంటున్నారు.

ఇదిలాఉంటే పవన్ కళ్యాణ్ విషయంలో ఎప్పుడు స్పందించని ముద్రగడ మొదటి సారిగా స్పందించారు అంతేకాదు ఏకంగా లేఖని రాసి పంపారు పవన్ కి అసలు ఏమిటా లేఖ అంటే మీరు ఎంతో గొప్ప ఉద్యమం చేస్తున్నారు మీ ఉద్యమానికి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాము.మీ తల్లిగారిని తిట్టినందుకు మీరు చేస్తున్న ఉద్యమంలో నా సపోర్ట్ కూడా ఉంటుందని అన్నారు అంతేకాదు చంద్రబాబు మిమ్మల్ని అణగదొక్కాలని అనుకుంటున్నారు అయితే ఇప్పుడు మీరు తన పర భేదం లేకుండా బయటకి రండి చంద్రబాబు ని రోడ్డు మీదకి రాగండి అంటూ సలహాలు ఇస్తున్నారు.అయితే ఎక్కడా లేని ప్రేమని అరువు తెచ్చుకుని మరీ ముద్రగడ పవన్ కళ్యాణ్ మీద సానుభూతి ప్రకటిస్తున్నారు.

మీరు ఒక మెట్టి దిగి రావాలి అన్ని పార్టీలని మనం ఏకం చేద్దాం.మనకి జరిగిన అన్యాయాన్ని రోడ్డుపై కి వచ్చి ప్రశ్నించి చంద్రబాబు ని రోడ్డు మీదకి లాగుదాం అంటూ రెచ్చ గొడుతున్నారు.

Advertisement

అయితే ముద్రగడ పవన్ కి ఈ రేంజ్ లో లేఖలు రాయడం వెనుకాల బలమైన స్కెచ్ ఉందని అంటున్నారు విశ్లేషకులు కాపులని వైసీపి వైపుకు తిప్పుకోవాలి అంటే ఈ సమయంలో తప్పకుండా ముద్రగడ తో పాటుగా పవన్ కళ్యాణ్ మద్దతు కూడా కావాలి అంటే పవన్ బయట నుంచీ వైసీపి కి మద్దతు తెలిపినా సరిపోతుంది అందుకే సానుభూతిగా ముద్రగడ తో లేఖని రాయించారు అయితే గతంలో ప్రత్యేక హోదా కోసం జనసేన బృందం ముద్రగడని కలిసి జాయింట్ యాక్షన్ కమిటిని ఏర్పాటు చేయాలనీ భావించిన పవన్ కోరికని ముద్రగడ తోసిపుచ్చారు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన ఏ ఉద్యమానికి సపోర్ట్ చేయని ముద్రగడ ఇప్పుడు పని గట్టుకుని పవన్ ని చంద్రబాబు పై ఉసిగొల్పడానికి లేఖలు రాస్తున్నాడు.అందుకే పాత విషయాలని లేవనెత్తుతూ పవన్ కళ్యాణ్ కి అండగా ఉంటున్నట్టుగా కలరింగ్ ఇస్తున్నారు.

అయితే ఈ విషయంలో స్పందించిన టీడీపీ నేతలు ముద్రగడ ముగిసిపోయిన అంకం అతని గురించి ఎక్కువగా చర్చించుకోవడం కూడా అనవసరం తన కొడుకు టిక్కెట్టు కోసం జగన్ ఏది చెప్పినా చేయడానికి ముద్రగడ సిద్దంగా ఉన్నాడు అందుకే కాపుల గౌరవాన్ని జగన్ దగ్గర తాకట్టు పెట్టడానికి కూడా ముద్రగడ సిద్దం అయ్యాడు అంటూ మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు