టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మృణాల్ ఠాకూర్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా సీతారామం( Sita Ramam ).
గత ఏడాది విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.ఈ ఒక్క సినిమాతో ఊహించని విధంగా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.
ఈ సినిమాతో భారీ హిట్ టాక్ ని తన ఖాతాలో వేసుకుంది.సీతారామం సినిమాలో సీతగా అద్భుతంగా నటించి యూత్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
కాగా ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan ) హీరోగా నటించిన విషయం తెలిసిందే.
హనురాఘవాపుడి( Hanu Raghavapudi ) ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మనందరికీ తెలిసిందే.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముందుకు వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది.తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అవకాశాలు వస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఈమె నేచురల్ స్టార్ నాని 30( Nani 30 )సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అవ్వగా ఇటీవలే ఈ సినిమాను అనౌన్స్ చేశారు.ఇదిలా ఉంటే తాజాగా మృణాల్ కు బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది.
ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.మృణాల్ ఈ మెయిల్ హ్యాక్ అయ్యిందట.
ఎవరో సైబర్ నేరగాళ్లు( Cyber Criminals ) మృణాల్ ను బెదిరిస్తున్నారట.ఇదే విషయాన్ని తెలుపుతూ ఆమె ఒక వీడియోని షేర్ చేసింది.నా ఈ-మెయిల్ ఖాతా హ్యాక్( EMail Hack )చేశారు.దీని ద్వారా గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతున్నారు.నా వ్యక్తిగత సమాచారం, నా సినిమా స్క్రిప్ట్లన్నీ అందులోనే ఉన్నాయి అని తెలిపింది.అయితే అదంతా నిజం కాదు.
ఆమె ఈ వీడియో రానా నాయుడు సిరీస్ ప్రమోషన్స్ కోసం చేసింది.ఇలా మీ ఈమెయిల్ హ్యాక్ అయితే దాని నుంచి ఎలా బయట పడాలో తెలియాలంటే రానా నాయుడు చూడండి అంటూ చెప్పుకొచ్చింది.
కాగా వెంకటేష్, రానా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్( Rana Naidu ) నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.