అయోధ్య రామ మందిర నిర్మాణంకు వైసీపీ ఎంపీ విరాళం ! ఎంతో తెలుసా ?

అయోధ్య లో రామమందిరం నిర్మించాలనే కల త్వరలో సాకారం కాబోతుంది.అందుకు కేంద్ర ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లను సిద్దం చేస్తుంది.

 Mp Raghuramakrishnam Raju Donate The Fund Construct The Rama Mandiram , Mp Raghu-TeluguStop.com

ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ కూడా చేశాడు.ఈ నెల 15 నుండి రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరిస్తున్నారు.

అందుకు వి‌హెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్, వంటి సంస్థలు బాగస్వామ్యం అవ్వుతున్నాయి.ముందుగా రాముడి ఆలయ నిర్మాణం కోసం దేశ ప్రథమ పౌరుడు రాష్ట్ర పతి రామ్ నాథ్ కొవింద్ మొదట విరాళంగా 5,00,1000 రూపాయలను ఇచ్చాడు.

ఈ నేపథ్యంలోనే నరసాపురం ఎం‌పి రఘు రామకృష్ణం రాజు 1,11,111 రూపాయలను విరాళంగా ఇచ్చాడు.అంతకు ముందు భూమి పూజ సందర్భంగా మూడు నెలల జీతం ను విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ మందిరనిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాగస్వామ్యం కావాలని కోరాడు.తాము ఎంత ఇచ్చింది అనేది ముఖ్యం కాదు అన్నాడు.10 రూపాయలనుండి 100 రూపాయల వరకు ఇవ్వొచు అన్నాడు.ఆయన ఇచ్చిన విరాళం మొత్తాని ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు విరాళాలను పంపించేందుకు అవసరమైన వివరాలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఓ వజ్రాల వ్యాపారి ఏకంగా 11 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube