వైసీపీకి నర్సాపురం నియోజకవర్గ ఎంపీ రఘురామ కృష్ణరాజు( Raghu Rama Krishna Raju ) రాజీనామా చేశారు.ఈ మేరకు రఘురామ తన రాజీనామా లేఖను సీఎం జగన్( CM Jagan ) కు పంపారు.అయితే పార్టీకి మాత్రమే రాజీనామా చేస్తానన్న ఆయన ఎంపీ పదవికి మాత్రం రాజీనామా చేయబోనని ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే.2019లో వైసీపీ తరపున నరసాపురం ఎంపీగా రఘురామ కృష్ణరాజు విజయం సాధించారు.
ఆ తరువాత పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు.త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీకి రాజీనామా చేశారు.వచ్చే ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేస్తానన్న రఘురామ ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో జరిగే టీడీపీ – జనసేన( TDP , Janasena ) ఉమ్మడి సభలో పాల్గొంటానని తెలిపారు.