టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వీడియో నకిలీదని ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు.
మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడినట్లుగా వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.ఆ వీడియో నిజమైనది కాదని కాణిపాకం ఆలయంలో ప్రమాణానికి సిద్ధమని తెలిపారు.
ఫేక్ వీడియో పట్టుకుని ఓ ఎంపీని మానసికంగా వేధిస్తున్నారని చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలపై మండిపడ్డారు.ఆ వీడియో ఒరిజినల్ అని తేలితే .ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు.