తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది సంగీత దర్శకులు ఉన్నారు.అయితే వీరిలో కేవలం ఒకే ఒక మహిళ సంగీత దర్శకురాలిగా ఎం ఎం శ్రీలేఖ పేరు సంపాదించుకున్నారు.
ఈమె సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో చిన్నప్పటి నుంచి సినిమాపై సంగీతంపై ఎంతో మక్కువ ఏర్పడింది.ఈ క్రమంలోనే తన అన్నయ్యల బాటలోనే శ్రీలేఖ కూడా సంగీత దర్శకురాలిగా స్థిరపడి ఎన్నో అద్భుతమైన సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి తనకంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలేఖ తన కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.అందరిలాగే తాను కూడా కెరియర్ మొదట్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని అయితే వాటి గురించి పెద్దగా ఆలోచించే దాన్ని కాదని ఈ సందర్భంగా ఈమె వెల్లడించారు.
ఇకపోతే తనకు సంగీత దర్శకురాలిగా కావడం కన్నా సింగర్ కావడం చాలా ఇష్టమని శంకరాభరణం సినిమాలో చిన్న పిల్లాడు పాడే పాట విని తాను కూడా సింగర్ కావాలనుకున్నాను అంటూ ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.
ఇక తాను సింగర్ కావాలని పట్టుబడటంతో తన కుటుంబ సభ్యులు తనకు సంగీతం నేర్పించాలని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరకు తీసుకు వెళ్తే బాలు గారు తనకు సంగీతం నేర్పనని మొహం మీదే చెప్పారట.అలా ఎందుకు చెప్పారనే విషయం గురించి శ్రీలేఖ మాట్లాడుతూ తన గొంతు సరిగా లేదని అప్పుడు నా గొంతు గాడిది గొంతులా ఉంది నేను సంగీతం నేర్పని మొహం మీదే చెప్పారని ఈ సందర్భంగా శ్రీ లేఖ ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.