సీబీఐ అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavita ) కోర్టును ఆశ్రయించనున్నారు.ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో( Rouse Avenue Court ) కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు ( Mohit Rao )పిటిషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే అత్యవసరంగా తమ పిటిషన్ ను విచారించాలని కవిత తరపు లాయర్ న్యాయస్థానాన్ని కోరనున్నారు.ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జైలులో కవితను సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తుందని పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేయనున్నారు.
అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా జైలులో ఉన్న కవితను సీబీఐ అదుపులోకి తీసుకుంది.







