టీడీపీ అధినేత చంద్రబాబు ఖమ్మం బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు.చుక్కలు ఎన్ని ఉన్నా తెలంగాణలో కేసీఆర్ ఒక్కరే చంద్రుడని చెప్పారు.
టీడీపీ రాజకీయాలు తెలంగాణలో చెల్లవని పేర్కొన్నారు.చంద్రబాబు ఇక్కడ టీడీపీకి మళ్లీ ప్రాణం పోయాలనుకుంటున్నారని తెలిపారు.
వారు తెలంగాణ బాగు కోరలేదని, అందుకే ప్రజలు రిజెక్ట్ చేశారని వెల్లడించారు.ఇప్పుడొచ్చి రాజకీయం చేస్తే మళ్లీ రిజెక్ట్ చేస్తారని స్పష్టం చేశారు.