ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు చాలామంది ప్రజలు జ్ఞాపక శక్తి సమస్యతో బాధపడుతున్నారు.జ్ఞాపక శక్తి సమస్యను తగ్గించుకోవడానికి ఈ ఆహార పదార్థాలను తినడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది.
ఈ ఆహార పదార్థాలను తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరగడమే కాకుండా చలి కాలంలో కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
బ్లూబెర్రీ ఒక రకమైన పండు.
ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఈ పండు జాతికి చెందిన చాలా రకాల పండ్లు ఉన్నాయి.
ఉదాహరణకి స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, బెర్రీలు, మల్బరీలు మొదలైనవి.బ్లూబెర్రీస్లో అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.ఇవి మెదడు ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోగపడతాయి.అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి.అందువల్ల శరీరంలో ఎక్కడైనా వాపు మరియు ఒత్తిడిని కూడా ఇవి తగ్గిస్తాయి.పసుపులో కూడా జ్ఞాపక శక్తిని పెంచే ఔషధాలు ఎన్నో ఉంటాయి ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పసుపును వేసుకోవడం వల్ల ఎంతో మంచిది అయితే పసుపు జ్ఞాపకశక్తి నే కాకుండా చర్మ సంబంధిత వ్యాధులను కూడా రాకుండా చేస్తుంది.
కాలీఫ్లవర్ చలికాలంలో మార్కెట్లో బాగా ఎక్కువగా లభిస్తుంది.ప్రతి రోజు కాకపోయినా వారంలో రెండు మూడు రోజులు కాలీఫ్లవర్ తినడం వల్ల జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది ఎందుకంటే కాలీఫ్లవర్ లో మెదడుకి శక్తిని అందించే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ కె, విటమిన్ బి కాంప్లెక్స్ లు ఉంటాయి.

గుమ్మడి గింజలు కూడా జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో ఎంత గానో ఉపయోగపడతాయి.ఎందుకంటే వీటిలో మెగ్నీషియం ఐరన్ జింక్ కాపర్ వంటి అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.గుమ్మడి గింజల్లో ఉండే సూక్ష్మపోషకాలు మెదడు ఆరోగ్యంగా పనిచేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.కాబట్టి ప్రతిరోజు ఆహారంలో ఈ ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవడం మంచిది.