బీజేపీపై ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.
ఈ క్రమంలోనే కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను నిలిపి వేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.ఉచితాలను తీసేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.
రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటోలు పెట్టాలని ఆర్థికమంత్రి కలెక్టర్ తో వివాదానికి దిగడం ఎంతవరకు సమంజసం అని ఆమె ప్రశ్నించారు.రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని కవిత వ్యాఖ్యనించారు.