తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavitha ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.60 రోజుల్లో కాంగ్రెస్ చేసిందేముందని ప్రశ్నించారు.సుమారు 60 రోజుల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఒక్క రోజు మాత్రమే ప్రజలను కలిశారని తెలిపారు.గతంలో కేసీఆర్ పాలనను విమర్శించిన మీరు ఆయన బాటలోకి వచ్చారని తెలిపారు.
ప్రజల వద్దకే పాలన పోవాలి కానీ పాలకుల వద్దకు ప్రజలు రాకూడదని నిరూపించి.
కేసీఆర్( KCR ) దారి కరెక్ట్ అని ఆయన బాటలోకి రావడం సంతోషకరమని చెప్పారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ వెళ్తున్నారు.దానికి డబ్బులు ఎక్కడివి అని కవిత ప్రశ్నించారు.
సీఎం సోదరులు జిల్లా రివ్యూల్లో ఎలా పాల్గొంటారో చెప్పాలన్నారు.మాట్లాడితే కుటుంబ పాలన అంటారు.
కాంగ్రెస్ లో 22 కుటుంబాల నుంచి టికెట్లు ఇచ్చారని తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడూ జై తెలంగాణ( Jai Telangana ) అనలేదని విమర్శించారు.