తెలంగాణలో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు.నిజామాబాద్ లో కాంగ్రెస్ నిరుద్యోగ మీటింగ్ పెట్టడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు.
కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.వంద రోజుల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్ చెప్పారన్న ఆమె ఇప్పటివరకు కర్ణాటకలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా ప్రారంభించలేదని చెప్పారు.
నిరుద్యోగంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు నంబర్ వన్ గా ఉండగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ రెండో స్థానంలో ఉందని తెలిపారు.రాజస్థాన్ లో 24 శాతం నిరుద్యోగం ఉందన్నారు.తెలంగాణలో గత పదేళ్లలో 2.31 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని, 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు.కానీ ఇప్పుడు తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం లేదన్న ఎమ్మెల్సీ కవిత ఈ సారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.