వర్షంలో సైతం ముంపుకు గురైన బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ..

శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఏకతాటిగా కురుస్తున్న వర్షంలో సైతం ముంపుకు గురైన బాధితులను పరామర్శించేందుకు విచ్చేశారు.కర్ణాటక రాష్ట్రాలలో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నా జయమంగళీ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

 Mla Nandamuri Balakrishna Visited The Victims Who Were Flooded Even In The Rain,-TeluguStop.com

హిందూపురంలోని కొట్నూరు, శ్రీకంఠాపురం చెరువుల మరవులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.దింతో చౌడేశ్వరి కాలనీ, ఆర్టీసీ కాలనీ, పళని నగర్ ఇళ్లలోకి వరద నీరు చేరాయి.

ఈ ప్రాంతాలలో ఎమ్మెల్యే బాలకృష్ణ వరద నీటిలో నడుచుకుంటూ వెళుతూ వెళ్లి వారిని పరామర్శించారు.ముంపు ప్రాంతాలలో జల జీవనంతో మేము ఇక్కడ నివసించలేకపోతున్నామని ఇంతవరకు ఇక్కడ ఏ ఒక్కరూ పర్యటించడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే బాలకృష్ణకు చేతులెత్తి నమస్కరించి, కాళ్లు పట్టుకున్నారు.

బాధితులకు ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఇల్లు కూలిన బాధితులకు తక్షణమే నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే బాలక్రిష్ణ హామీ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube