ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.తనను అరెస్ట్ చేస్తారంటూ సజ్జల లీకులు ఇస్తున్నారన్నారు.
ఈ నేపథ్యంలో లీకులు ఇవ్వడం ఎందుకన్న ఆయన వచ్చి అరెస్ట్ చేసుకోండని తెలిపారు.
తన గొంతు ఆగాలంటే ఎన్ కౌంటర్ చేయండి అంటూ కోటంరెడ్డి వ్యాఖ్యనించారు.
తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోండని పేర్కొన్నారు.ఇసుకాసురులు, మద్యం వ్యాపారులపై కూడా ఆడియోలను రిలీజ్ చేయాలన్నారు.
ఆ మరుసటి రోజే సజ్జల పోస్ట్ ఊడిపోతుందని వెల్లడించారు.అవమానాలు భరించలేకనే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.
అధికారమే కావాలనుకుంటే గతంలోనే టీడీపీలో చేరేవాడినని చెప్పారు.తన బిడ్డలపై విమర్శలు చేయొద్దని ఎమ్మెల్యే కోటంరెడ్డి కోరారు.