జెడ్పీ హై స్కూల్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

చొప్పదండి నియోజకవర్గం శాసన సభ్యులు మేడిపల్లి సత్యం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని జెడ్పీ హై స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది.

పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

నూతన భవనంలో గల తరగతి గదులలో ఫ్లోరింగ్ లేదని తెలపడంతో వెంటనే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఫ్లోరింగ్ వేయడానికి హామీ తీసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో, ఎమ్మెల్యే తో పాటు మండల విద్యాధికారి , సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు కూస రవీందర్, మండలంలోని కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు ప్రత్యేక ధన్యవాదములు తెలియ జేశారు.

బాల్య మిత్రునికి లక్ష రూపాయల సాయం
Advertisement

Latest Rajanna Sircilla News