బ్యాంకుల్లో చోరీ చేసే వాళ్లు బలంగా, చేతిలో తుపాుకులు, మారణాయుధాలతో ఉంటారనే అనుకుంటాం మనమంతా.కానీ ఓ బ్యాంకులో మాత్రం బాలుడి దొంగతనానికి పాల్పడ్డాడు.
మొత్తానికి 35 లక్షలు కాజేసి అందిరనీ ఆశ్చర్యానికి గురి చేశాడు.అసలు ఆ అబ్బాయి చోరీకి పాల్పడతాడని ఎవరూ అనుకోరు.
అదే అతనికి ప్లస్ అయింది.బ్యాంకు యజమానులకు మైనస్ అయింది.
అయితే ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.ఇందులో బాలుడితో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు.
అసలేమైంది, ఎక్కుడ ఈ దొంగతనం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పంజాబ్ పటియాలలోని షెరాన్ వాలా గేట్ ప్రాంతంలో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ చోరీ జరిగింది.
క్షణాల్లోనే ఓ బాలుడు 35 లక్షల రూపాయలను కాజేశాడు.సీసీటీవీల్లో సంబంధిత దృశ్యాలు నమోదు అయ్యాయి.బుధవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.సీసీటీవీ దృశ్యాల ఆధారంగా.బాలుడిని వెతికే పనిలో పడ్డారు పోలీసులు.25 ఏళ్ల ఓ యువకుడితో బాలుడు బ్యాంకులోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు.25 నిమిషాల పాటు రెక్కీ నిర్వహించి ఎవరి కంటా పడకుండా డబ్బు దోచుకెళ్లారని వివరించారు.ఏటీఎంలో డిపాజిట్ చేయాల్సిన డబ్బును బ్యాంకు అధికారి క్యాష్ కౌంటర్ బయట ఉంచిన సమయంలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది.అయితే ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.