చంద్రబాబు మాయమాటలకు అమాయక మహిళల ప్రాణాలు పోయాయి - మంత్రి విడదల రజిని

గుంటూరు: మంత్రి విడుదల రజిని కామెంట్స్.చంద్రబాబు ప్రచార యావ వల్ల ముగ్గురు మహిళల ప్రాణాలు పోయాయి.

అరకేజీ నూనె., అరకేజీ కందిపప్పు చీర ఇస్తామంటూ జనాలను వాహనాలలో తీసుకువచ్చారు.

మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మహిళలను లైన్లలో నిలబెట్టారు.చంద్రబాబు మాయమాటలకు అమాయక మహిళల ప్రాణాలు పోయాయి.

ముగ్గురు మహిళలు చనిపోయారు.ఎంతోమంది తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

అధికార యావకోసం.ఆర్భాటాలకోసం అమాయక ప్రజల ప్రాణాలు తీయడం అమానుషం.

జరిగిన చావులకు చంద్రబాబు పూర్తిగా బాధ్యత వహించి తీరాలి.జరిగిన ఘటనతో చంద్రబాబు బుద్ది తెచ్చుకోవాలి.

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.మెరుగైన వైద్యం అందించేందుకు ఆదేశాలిచ్చాం.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు