గన్ ఫైర్ ఘటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ ఇచ్చారు.భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా మహబూబ్ నగర్ లో ఫ్రీడమ్ ర్యాలీ చేపట్టారు.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎస్ఎల్ఆర్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.దీనిపై స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ తను కాల్చింది రబ్బర్ బుల్లెట్ అని తెలిపారు.
ఎస్పీనే తుపాకీ ఇచ్చారన్నారు.అదేవిధంగా తను ఆల్ ఇండియా రైఫిల్ అసోసియేషన్ మెంబర్ ని అని, స్పోర్ట్స్ మీట్ లో ఇలా కాల్చడం సహజమే అని వెల్లడించారు.
ర్యాలీ ప్రారంభం కావాలంటే సౌండ్ కోసం రబ్బర్ బుల్లెట్ తో కాల్పులు జరుపుతారని స్పష్టం చేశారు.కాల్పులు ఎప్పుడు జరపాలో తనకు తెలుసునని, అది నిజం బుల్లెట్ అయితే రాజీనామా చేస్తానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.