రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్ లో గురువారం రోజు బిఆర్ఎస్ నాయకులుసుంకపాక మనోజ్ తండ్రి విశ్రాంత సెస్ ఏ ఈ సుంకపాక రాజయ్య ఇటీవల మరణించిన నేపథ్యంలో మంత్రి కేటిఅర్( Minister KTR ) వారి నివాసానికి వెళ్లి మనోజ్ కుటుంబ సభ్యులను పరామర్శించరు చిత్రపటానికి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయనతోపాటు ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్( Koppula Eshwar ) ,ఎమ్మెల్యే రవి శంకర్, జెడ్పి చైర్ పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి,ఎంపీపీ పర్లపళ్లి వేణు గోపాల్, జెడ్పిటిసి కత్తెరపాక ఉమా కొండయ్య, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కత్తెర పాక కొండయ్య, రైతుబంధు అధ్యక్షుడు కొంకటి లచ్చిరెడ్డి,మండలంలోని సర్పంచులు ,ఎంపీటీసీలు, చైర్మన్లు ,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.