టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.చంద్రబాబు రైతు పోరుబాటను ఎవరూ నమ్మరని తెలిపారు.చంద్రబాబు గతంలో రైతులకు రూ.5,600 కోట్లు ఎగ్గొట్టారని ఆరోపించారు.చంద్రబాబు రావడం వలన రైతుల పనికి అడ్డు తప్ప ఏమీలేదని చెప్పారు.రైతులు దగ్గర ప్రతి గింజ కొంటున్నామని తెలిపారు.జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత 31.87 లక్షల మంది రైతుల వద్ద 3.27 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు.