నిన్న హైదరాబాద్ శిల్పకళా వేదికలో సీఏ విద్యార్థులు అంతర్జాతీయ సదస్సులో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.తాను ఒక ఫెయిల్యూర్ పొలిటికల్ లీడర్ అని అన్నారు.
దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపాయి.ఈ క్రమంలో పవన్ శిల్పకళా వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
అవును పవన్ రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు అన్నది వాస్తవం అని అన్నారు.ఇదే సమయంలో ఆయన నటుడిగా విజయవంతం అయ్యారని వెల్లడించారు.
రాజకీయాల్లో ఎప్పటినుండో రాణిస్తున్న పవన్ ఒకసారి కూడా గెలిచింది లేదు.రాబోయే రోజుల్లో కూడా పవన్ గెలిచే అవకాశాలు లేవని వెల్లడించారు.సైద్దాంతిక సిద్ధాంతాలు లేని పవన్ కళ్యాణ్.రాజకీయాల్లో సరైన పాత్రను పోషించలేకపోతున్నారని విమర్శలు చేశారు.
విప్లవ నేతగా తనని తాను చేగువేరాగా ప్రారంభంలో పరిచయం చేసుకున్న తర్వాత కమ్యూనిస్టులను పక్కనపెట్టి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపితో కలిశారని.పవన్ అందుకే రాజకీయంగా ఫెయిల్ అయిన నాయకుడని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.