సీఎం జగన్ పై రాయి దాడి ఘటనపై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు..!!

విజయవాడలో వైయస్ జగన్ “మేమంతా సిద్ధం”  బస్సు యాత్ర జరుగుతోంది.ఈ క్రమంలో సరిగ్గా సింగ్ నగర్ చేరుకున్నాక.

 Minister Ambati Rambabu Sensational Comments On The Incident Of Stone Attack On-TeluguStop.com

సీఎం జగన్ ఎడమ కంటిపై రాయితో దాడి చేయడం జరిగింది.దాడి జరిగిన అనంతరం.

రక్తం రావడంతో వెంటనే బస్సు పై నుండి.లోనికి వెళ్లి ప్రథమ చికిత్స చేయించుకున్నారు.

సీఎం జగన్ పై విజయవాడలో దాడి జరగటం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.సీఎం జగన్ కి తాకిన రాయి పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్( vellampalli srinivas ) కి కూడా తాకింది.

ఆయనకి కూడా స్వల్పంగా గాయం కావడం జరిగింది.ఈ క్రమంలో సీఎం జగన్( CM Jagan ) పై రాయి దాడి ఘటనపై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైయస్ జగన్ కి వస్తున్న ప్రజాదరణ తట్టుకోలేక చంద్రబాబు దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారని విమర్శించారు.చంద్రబాబు( Chandrababu ) ప్రోత్బలంతోనే దాడి జరిగిందని వ్యాఖ్యానించారు.ఎన్నికలలో మళ్లీ అధికారంలోకి రాలేమని.ఓడిపోతామని.చంద్రబాబు ఈ రకమైన దాడులకు పాల్పడుతున్నారని అంబటి రాంబాబు( Ambati Rambabu) తన అభిప్రాయం వ్యక్తం చేశారు.చంద్రబాబు మరియు లోకేష్ కలసి కుట్ర చేసి విజయవాడ నడిబొడ్డులో జగన్ పై దాడి చేయించారని ఆరోపించారు.

అత్యంత ప్రజాదారణ పొందుతున్న వైఎస్ జగన్ ని ఎదుర్కోలేక రాళ్లతో దాడులు చేస్తున్నారు.కచ్చితంగా చంద్రబాబు మూల్యం చెల్లించుకుంటారని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube