టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ ఈ రోజు 42వ పెళ్లి రోజు జరుపు కుంటున్నారు.ఈ సందర్భంగా ఆయనకు ప్రముఖుల దగ్గర నుండి అభిమానుల వరకు అందరు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
ఇక ఇటీవలే కేవలం ఒక్క రోజులో పలు ఆధ్యాత్మిక స్థలాలను సందర్శించి వార్తల్లో నిలిచినా మెగాస్టార్ ఇప్పుడు వెకేషన్ కు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇటీవలే ఆయన సమతామూర్తి విగ్రహాన్ని దర్శించి ఆ తర్వాత శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించి అనంతరం గురువాయూర్ లోని శ్రీకృష్ణుడి ఆలయాన్ని సందర్శించు కున్నారు.
ఇక ఇప్పుడు ఒక లాంగ్ వెకేషన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.ఆయన అతి త్వరలోనే మాల్దీవులకు వెళ్లి అక్కడ సరదాగా గడపనున్నారని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే.ఈయన కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.ఆచార్య సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా, మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాలు ప్రకటించాడు.
ఇప్పటికే గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి శరవేగంగా జరుగుతుంది.భోళా శంకర్ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు చిరంజీవి.
అలాగే బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ ను కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాడు.ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో 154వ సినిమాగా తెరకెక్కబోతుంది.
అలాగే బాబీ దర్శకత్వంలో ఒక సినిమా, వెంకీ కుడుముల దర్శకత్వంలో మరొక సినిమాలు చేస్తున్నాడు.