కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం వంటి వారు ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం రంగమార్తాండ(Rangamarthanda).చాలా రోజుల తర్వాత కృష్ణవంశీ(Krishnavamsi) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.
ఇదివరకే ఈ సినిమా చూసినటువంటి పలువురు సెలబ్రిటీలు ఏకంగా కంటతడి పెట్టుకున్న సంఘటనలు మనకు తెలిసిందే.తాజాగా ఈ సినిమా చూసినటువంటి మెగాస్టార్ చిరంజీవి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) రంగమార్తాండ సినిమా గురించి ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ.రంగమార్తాండ సినిమా చూశాను… ఈ మధ్యకాలంలో చూసిన సినిమాలలో ఇదొక గొప్ప సినిమా.ఈ సినిమాలో ద్వారా ప్రతి ఆర్టిస్టుకు తన జీవితాన్నే కళ్ళ ముందు చూపిస్తున్నట్టు ఉంది.ఈ సినిమా చూస్తుంటే త్రివేణి సంగమంలా అనిపించింది కృష్ణవంశీ లాంటి దర్శకుడి దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం నటన భావోద్వేగానికి గురిచేసింది.
బ్రహ్మానందం ఇంత ఇంటెన్సిటీ ఉన్న ఓ అనూహ్యమైన పాత్రని చేయటం తొలిసారి.సెకండ్ హాఫ్ మొత్తం అప్రయత్నంగానే కంటతడి నిండింది.ఒక కంప్లీట్ ఎమోషనల్ జర్నీ అయినటువంటి ఈ సినిమాని ప్రతి ఒక్కరు ఆదరించవలసినవి.ఇలాంటి రసవత్తరమైన చిత్రం తీసిన కృష్ణవంశీకి, ప్రకాష్ రాజ్కి, రమ్యకృష్ణకి చిత్రయూనిట్ అందరికీ అభినందనలుఅంటూ చిరంజీవి ఈ సినిమా గురించి చెబుతూ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమాకు చిత్ర బృందం పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించకపోయినా కేవలం మౌత్ టాక్ ద్వారా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోందని చెప్పాలి.