చిరంజీవి 150 కి పైగా సినిమాలు తీసి తెలుగులో చాలామంది హీరోలకు సాధ్యం కానీ మెగా ఫిట్ ని సాధించిన స్టార్ హీరో.కేవలం హీరోగా ఉంటే కిక్కేముందు చెప్పండి.
అందుకే సినిమాలు వద్దు అనుకొని పదేళ్లపాటు రాజకీయాలు చేశాడు.కానీ మనం తీసుకునే ప్రతి స్టెప్పు పూలదారి కావాలని ఏమీ లేదు అలాగే రాజకీయాల్లో చిరంజీవి సరిపడడు అని తెలుసుకున్నాడు.
అందుకే తన పార్టీని కూడా లేకుండా భూస్థాపితం చేసేసాడు.మళ్లీ తిరిగి పూర్వరూపం సాధించి సినిమాల్లోకి దూసుకొచ్చాడు.
అయినా చిరంజీవిలో ఏదో మిస్సయింది.పూర్వ వైభవం రాలేకపోతోంది.
మెగాస్టార్ చిరంజీవి తనను తాను కమర్షియల్ ఫార్ములాగానే భావిస్తూ సినిమాలు తీస్తూ ఉండడంతో చాలామంది అభిమానులు ఆ లోటును ఫీల్ అవుతున్నారు.
సరే సినిమాలు ఎలాగూ తీస్తూ పోతారు.ఒకటి పోయినా మరొకటి వస్తుంది దానితో ఎలాగోలా మరో మూడు నాలుగు ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉండవచ్చు.కానీ మధ్య మధ్యలో చేస్తున్న కొన్ని పనులు మాత్రం చిరంజీవి స్థాయిని తగ్గిస్తున్నాయి.
మరీ ముఖ్యంగా కామెడీ షోలకి, రియాలిటీ షోలకి వెళ్లి ఏదో ఒకటి మాట్లాడేసి అడ్డంగా బుక్ అవుతూ ఉంటాడు చిరంజీవి.సినిమా ఫంక్షన్ వచ్చిందంటే చాలు స్టేజి పై సినిమా పేరును లేదా ఇంకో ఏదో ముఖ్యమైన విషయాన్ని తనకు తెలియకుండానే లీక్ చేస్తూ ఉంటాడు.
అలాగే టాక్ షోలలో సైతం వారు మాట్లాడించాలి కాబట్టి నోటికొచ్చిన ప్రశ్న అడుగుతుంటారు.చిరంజీవి స్థాయితో సరిపోని ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పి అప్పుడప్పుడు బుక్ అవుతుంటాడు.
పవన్ నక్సలైట్స్ లోకి వెళ్తాడు అనుకున్నాం అని అలా జరగలేదు అంటూ పవన్ కళ్యాణ్ పై బాంబ్ పేల్చినంత పని చేశాడు.ఇక సుమతో కామెడీ షో లో పాల్గొనడం, నిజం విత్ స్మిత అనే రియాలిటీ షో కి వెళ్లడం ఇలా కొన్ని ప్రోగ్రామ్స్ లో పాల్గొని తన స్థాయికి మించిన పనులు చేయడం పట్ల మెగా అభిమానులు ఫీల్ అవుతున్నారు.ఇకనైనా చిరంజీవి మంచి సినిమాలు చేసుకుంటూ తనదైన రీతిలో అందరిని అలరించాలే తప్ప అనవసరపు పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది అని జనాల అభిప్రాయం.మరి అందరి మొరను చిరంజీవి వింటాడో లేదో వేచి చూడాలి.