మీరాజాస్మిన్.ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే సినిమా గుడుంబా శంకర్.
ఈ సినిమాలో చిట్టి నడుమునే చూస్తున్నా అనే పాటతో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మీరాజాస్మిన్.అంతేకాకుండా ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.
ఒకప్పుడు వెండి తెరపై లుక్స్ తో తన మార్కును చూపించిన మీరా జాస్మిన్ ఆ తర్వాత కాలంలో సినిమా ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.కాగా మీరా జాస్మిన్ తెలుగులో పందెంకోడి, భద్ర, గుడుంబా శంకర్, గోరింటాకు సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలలో నటించినప్పటికీ ఈ మూడు సినిమాలు ఈమెకు మంచి గుర్తింపును తెచ్చిపడ్డాయని చెప్పవచ్చు.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళం లో కూడా నటించి హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.అన్ని భాషల్లో కలిపి దాదాపుగా 40 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది.
అయితే తెలియదు బాగా పిక్స్ లో ఉన్న సమయంలో ఈమె పెళ్లి చేసుకుని పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం మనందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే గత కొద్దిరోజులుగా మీరాజాస్మిన్ మళ్లీ సినిమాలలో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ విషయంపై ఆమె స్పందించకపోగా తాజాగా ఆ విషయాన్ని ఒక చిన్న ఫోటో ద్వారా హింట్ ఇచ్చింది.
తాజాగా మీరాజాస్మిన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక స్టూడియోలో డబ్బింగ్ చెబుతున్న ఫోటోని షేర్ చేసింది.అయితే ఏ సినిమా కోసం అన్నది మాత్రం వెల్లడించలేదు.అయితే అప్పటికి ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తోంది ఈ బ్యూటీ.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉంటూ వరుసగా ఫోటోషూట్లు చేస్తోంది.తన అందంతో యువతకు పిచ్చెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ.అయితే దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ మీరా జాస్మిన్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది.మరి తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుందా లేక ఇతర భాషలో ఎంట్రీ ఇవ్వబోతుందా అన్నది మాత్రం తెలియడం లేదు.