నిజామాబాద్ జిల్లాలో వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థి హాస్టల్ లో ఉరి వేసుకుని చనిపోయాడు.
మృతుడు ఆదిలాబాద్ జిల్లా చింతగూడకు చెందిన దాసరి హర్షగా గుర్తించారు.అయితే మెడికో ఆత్మహత్యపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.