గొడవ తర్వాత మొదటిసారి ట్వీట్ చేసిన మంచు మనోజ్.. మళ్లీ కలవండన్నా అంటూ కామెంట్స్!

మంచు మనోజ్ విష్ణు మధ్య గొడవలు ఉన్నాయని అందుకే వీరిద్దరి మధ్య మాటలు లేవు అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలకు అనుగుణంగానే మనోజ్ (Manoj)తన ఫ్యామిలీకి దూరంగా ఉండడమే కాకుండా తన పెళ్లిని కూడా మంచు లక్ష్మి(Manchu Lakshmi) నివాసంలో, తన సమక్షంలో చేసుకోవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి.

ఇలా వీరి గురించి వస్తున్నటువంటి వార్తలు పూర్తిగా నిజమేనని తాజాగా మీరు గొడవ పడినటువంటి వీడియో ద్వారా తెలుస్తుంది.

మనోజ్, విష్ణు(Vishnu) మధ్య పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకున్న విషయం మనకు తెలిసింది.అయితే ఇలా వీరిద్దరు గొడవ పడటంతో ఇద్దరి మధ్య ఇలాంటి గొడవలు చోటు చేసుకోవడానికి కారణం ఏంటి అనే విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.అయితే మనోజ్ మౌనికను వివాహం చేసుకోవడం విష్ణుకు ఇష్టం లేదని ఈ విషయం గురించి ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలితాయని వార్తలు వినపడుతున్నాయి.

ఇక ఈ విషయం గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ మీడియాలోనూ వార్తలు రావడంతో మంచు కుటుంబ సభ్యులు స్పందిస్తూ ఇది పెద్ద గొడవేమి కాదని ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా జరిగే గొడవలేనని తెలిపారు.

Advertisement

ఈ విధంగా విష్ణుతో గొడవ పడిన తర్వాత మొదటిసారి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.శుక్రవారం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్(Ajith)తండ్రి సుబ్రహ్మణ్యం కన్నుమూసిన విషయం మనకు తెలిసిందే.ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ఈయన పోస్ట్ చేశారు.

మణి గారి మరణ వార్త విని చాలా బాదేసింది.ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

ఇక ఈ ట్వీట్ వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజెన్స్ ఈ ట్వీట్ పై కామెంట్లు చేస్తూ అసలు మీ అన్నదమ్ముల మధ్య ఎందుకు గొడవ జరిగింది అన్న ఇది నిజమైన గొడవేనా.లేక ఫ్రాంక్ చేశారా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

ఎలాంటి గొడవలు ఉన్నా తిరిగి కలవండి అన్న అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు