తినేందుకు తిండి లేని వాళ్లు, పేదలు, సామాన్యులు, మధ్య తరగతి ప్రజల కోసం తీసుకొచ్చిన రేషన్ పంపిణీ కార్యక్రమంలో అవకవతవకలు మరోసారి బయటకు వచ్చాయి.ద్విచక్ర వాహనాలు, ఆటో, సైకిల్, అవేవీ లేని వాళ్లు సంచులు తీసుకొచ్చి రేషన్ బియ్యాన్ని తీసుకెళ్లడం మన అందరికీ తెలుసు.
కానీ ఓ వ్యక్తి మాత్రం బెంజి కారులో వచ్చి మరీ రేషన్ బియ్యాన్ని తీసుకెళ్లాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
పంజాబ్ లోని హోషియార్ పూర్ లోని ఓ ప్రభుత్వ రేషన్ దుకాణం ముందు ఓ లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ కారు వచ్చి ఆగింది.అందులో నుంచి ఓ వ్యక్తి దిగి నేరుగా రేషన్ దుకాణంలోకి వెళ్లాడు.
తన బీపీఎల్ కార్టు చూపించి సరుకులు తీసుకున్నాడు.
ఆ తర్వాత ఆ సంచులను కారు డిక్కీలో పెట్టించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఆ వ్యక్తి రేషన్ దుకాణం నుంచి కారులో సరుకులు తీసుకు వెళ్తున్న వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్టే చేయడంతో ఇది కాస్తా తీవ్ర దుమారం రేపింది.సదరు రేషన్ దుకాణాన్ని అమిత్ కుమార్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు.
ఈ వీడియో వైరల్ అవడంతో స్థానిక మీడియా విలేకర్లు అమిత్ ను ప్రశ్నించారు.అయితే ఆ వ్యక్తికి బీపీఎల్ కార్డు ఉందని.
తాను కేవలం కార్డు పరిశీలించిన తర్వాతే రేషన్ ఇచ్చానని తెలిపాడు.అతడు కారులో వచ్చిన విషయం తనకు తెలియదు అన్నారు.