ఇటీవలే కాలంలో ప్రతి చిన్న కారణానికి దారుణంగా హత్యలు చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది.అయితే హత్య చేసి తాము ఎప్పటికీ దొరకము అని అనుకుంటారు.
ఇక ఈ విషయం బయటకు రాదు అని అనుకుంటే అది పొరపాటే.ఎందుకంటే హత్య చేసిన తర్వాత ఏదో ఒక చిన్న తప్పు కూడా అడ్డంగా దొరికి పోయేలా చేస్తుంది.
ఇక పోలీసులకు కాస్త అనుమానం కలిగితే నిజాలను కచ్చితంగా వెలుగులోకి తీసుకొస్తారు.ఇలాంటి కోవలోనే ఓ ప్రియుడు ( Boy Friend ) అచ్చం దృశ్యం మూవీ( Drushyam Movie ) సినిమాలో మాదిరిగా ప్రియురాలిని ( Girl Friend ) హత్య చేశాడు.
తీగ లాగితే డొంక కదిలినట్లు పోలీసులకు కాస్త అనుమానం వచ్చింది.తమదైన శైలిలో విచారించగా అన్ని నిజాలు బయటకు వచ్చాయి.అసలు ఏం జరిగిందో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో అరవింద్ ( Aravind ) అనే వ్యక్తి తన ప్రియురాలిని హత్య చేశాడు.ఇక ఆ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి ట్యాంకులో ఆ ప్రియురాలు మృతదేహాన్ని దాచి పెట్టాడు.
ఇక దర్జాగా తనకేం సంబంధం లేదు అనే విధంగా ఉన్నాడు.బాధితురాలి తల్లిదండ్రులు ఆ యువతి కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు ప్రయాగ్ రాజ్ ప్రాంతమంతా జల్లెడ పట్టిన ఫలితం లేకుండా పోయింది.ఇక ఆమె ఫోన్ డేటాను పరిశీలిస్తే చివరగా అరవింద్ అనే వ్యక్తికి కాల్ చేసినట్టు ఆధారాలు లభించాయి.అరవిందును ప్రాథమిక విచారణ చేయగా తనకేం తెలియదు అంటూ బూటకపు మాటలు చెప్పాడు.పోలీసులు అరవిందును అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు.ఇక అరవింద్ హత్య చేసిన విషయాలను బయటపెట్టాడు.పోలీసులు ట్యాంక్ లో ఉండే మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
బాధితురాలిని 35 ఏళ్ల రాజ్ కేసర్ గా గుర్తించారు.ఈ హత్య 14 రోజుల క్రితం జరిగినట్లు తేలింది.