ఈ మధ్య తరచుగా మనం చూస్తున్న వార్తల్లో… సడెన్ గా కుప్పకూలిపోయి చనిపోయారని, డ్యాన్స్ చేస్తూ ప్రాణాలు విడిచారని, ఎక్సర్ సైజ్ చేస్తూనే అనంత లోకాలకు వెళ్లిపోయారనే వార్తలు వస్తున్నాయి.అయితే వినాయక నిమజ్జనోత్సవం, వేడుకల్లో ఇలాంటి ఘటనలు జరగడం మరింత ఎక్కువ.అయితే తాజాగా అలాంటి ఓ వీడియోనే నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే… గణేష్ చతుర్ధి వేడుకల్లో ఓ యువకుడు డ్యాన్స్ చేస్తూ ఉన్నట్టుటుండి కుప్పకూలిపోయాడు.పార్వతీ దేవి వేష ధారణలో ఉన్న ఆ ఆర్టిస్ట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.చాలా సేపటి వరకు ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు.కాసేపటికి గమనించి ఆస్పత్రికి తరలించగా.అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలిపారు.
అయితే ఇదెక్కడ, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
జుమ్ము కశ్మీర్ గణేష్ ఉత్సవాల్లో అపశ్రుతి జరిగింది.
జుమ్ము జిల్లాలోని బిశ్నాలో జరిగిన గణేష్ చతుర్ధి వేడుకల్లో డ్యాన్స్ చేస్తూయోగేశ్ అనే 20 ఏళ్ల యువుకుడు ప్రాణాలు కోల్పోయాడు.పార్వతీ దేవి వేషధారణలో ఉన్న ఇతడికి గుండెపోటు రావడం వల్ల స్టేజీపై నృత్యం చేస్తూ పడిపోయాడు.
అయితే విషయం గుర్తించని నిర్వాహకులు, ప్రేక్షుకులు కాసేపటి వరకు అతడి వద్దకు రాలేదు.కాసేపటిక శివుడి వేష ధారణలో ఉన్న వ్యక్తి లేపగా.ఎంతకీ లేవకపోవడంతో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.కానీ అప్పటికే యోగేష్ మృతి చెందాడని వైద్యులు చెబుతున్నారు.
ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ షాక్ కు గురవుతున్నారు.