ఉత్తరాఖండ్ రాష్ట్రం, హరిద్వార్ నగరంలో కన్వర్ యాత్ర( Kanwar Yatra ) జులై 4న ఆరంభమయ్యింది.ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు దేశ నలుమూలల నుంచి వస్తుంటారు.
జులై 15 వరకు అంగరంగ వైభవంగా ఈ యాత్ర జరుగుతుంది.ఈ యాత్రలో భాగంగా ఎన్నో అడ్డంకులు, సవాళ్లను ఎదుర్కొంటూ భక్తులు గంగానది నుంచి పవిత్ర జలాన్ని( Ganga Water ) సేకరించి ఆ జలాన్ని తమ రాష్ట్రాల్లోని శివాలయాలకు తీసుకెళ్తారు.
అయితే ఒక వ్యక్తి యాత్ర కోసం ఒక పెద్ద సాహసమే చేశాడు.అతడు గంగాజలాన్ని మాత్రమే కాకుండా తన తల్లిని( Mother ) కూడా మోస్తూ యాత్రను ప్రారంభించాడు.
కావడిలో ఓ వైపు తల్లిని, మరోవైపు గంగాజలాన్ని అతను మూసుకుంటూ వెళ్లడం ప్రారంభించాడు.అతని బతికి అంకిత భావానికి చాలామంది స్థానికులు ఫిదా అయ్యారు.కొందరు ఆ వ్యక్తిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.అది కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియో కింద నెటిజన్లు ‘హర హర మహాదేవ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కన్నతల్లిని, పవిత్రమైన గంగాజలాన్ని మోసుకెళ్తున్న ఇతడు ఎంతో గ్రేట్, చాలా పుణ్యం కూడా చేస్తున్నాడు అని కామెంట్లు పెడుతున్నారు.
ఇకపోతే ఏటా శివుని భక్తులు కన్వర్ యాత్రను ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో( Haridwar ) ప్రారంభిస్తుంటారు.ఈ యాత్రలో భాగంగా వారు ఉత్తరాఖండ్లోని గౌముఖ్ ,గంగోత్రిలతో పాటు బిహార్లోని సుల్తాన్గంజ్ వంటి పవిత్రమైన ప్రదేశాలు విజిట్ చేస్తారు.కాలికి చెప్పులు కూడా లేకుండా వీరు యాత్రలో పాల్గొంటారు.