త్రివిక్రం( Trivikram ) సినిమా తర్వాత మహేష్ రాజమౌళితోనే సినిమా చేస్తాడని విషయం తెలిసిందే.అయితే రాజమౌళి ఇప్పటివరకు కథని కూడా పూర్తి చేయలేదు.
అసలైతే ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో రాజమౌళి( Rajamouli ) సినిమా వర్క్ షాప్ లో పాల్గొనాలి అనుకున్న మహేష్ ఇంకా స్టోరీనే ఫైనల్ అవకపోవడంతో మళ్లీ ప్లాన్ మార్చినట్టు తెలుస్తుంది.ఇదివరకు అనుకున్నట్టుగానే త్రివిక్రం సినిమా పూర్తి కాగానే మరో డైరెక్టర్ తో 3 నెలల్లో ఒక సినిమా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడట.
అనీల్ రావిపుడి మహేష్ ( Mahesh babu )డైరెక్టర్ లిస్ట్ లో ఉన్నాడని తెలుస్తుంది.అయితే మహేష్ మరో సినిమా మొదలు పెడితే మాత్రం రాజమౌళిని వెయిటింగ్ లో పెట్టే ఛాన్స్ ఉంది.అయితే మహేష్ మొదలు పెడితే 3 నెలల్లో సినిమా ఫినిష్ చేయడం కష్టం.అందుకే మళ్లీ అది కూడా మధ్యలో ఆపడం ఎందుకు అని ఫ్యాన్స్ అంటున్నారు.
రాజమౌళి సినిమానే త్వరగా మొదలు పెడితే ఆ సినిమాకు ఎలాగు రెండేళ్లు టైం తీసుకుంటాడు.అందుకే మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది.మహేష్ ఆలోచన బాగానే ఉన్నా అనుకున్న విధంగా సినిమా పూర్తి కాకపోతే రాజమౌళి ప్రాజెక్ట్ మరింత లేట్ అయ్యే ఛాన్స్ ఉంది.