ఆ డైరెక్టర్ వద్దంటున్న మహేష్.. అతడే కావాలట!

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ రీసెంట్‌గా అల వైకుంఠపురములో సినిమాను ప్రొడ్యూస్ చేసి కళ్లు చెదిరే లాభాలను కొల్లగొట్టాడు.కాగా ఈ సినిమాను రాధాకృష్ణతో కలిసి నిర్మించిన అల్లు అరవింద్, తన నెక్ట్స్ మూవీని రెడీ చేస్తున్నారు.

 Mahesh Babu Rejects Parasuram And Wants Prashant Neel-TeluguStop.com

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో గీతా ఆర్ట్స్ బ్యానర్ ఓ సినిమాను తీసేందుకు రెడీ అయ్యింది.ఈ క్రమంలో గీతా గోవిందం వంటి బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు పరశురాంతో ఈ సినిమాను తెరకెక్కించాలని అల్లు అరవింద్ భావిస్తున్నాడు.

కానీ పరశురాం చెప్పిన కథ మహేష్‌కు నచ్చలేదట.దీంతో తనతో నెక్ట్స్ మూవీని చేసేందుకు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ రెడీగా ఉన్నాడని, ఆయనను ఈ సినిమాకు డైరెక్టర్‌గా పెట్టాలని మహేష్ కోరాడట.

కన్నడలో తెరకెక్కించిన కేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా సినిమాగా ఎలాంటి సక్సెస్‌ను అందుకుందో అందరికీ తెలిసిందే.అలాంటి ఓ పవర్‌ఫుల్ స్క్రిప్టు ప్రశాంత్ దగ్గర రెడీగా ఉందని, అది మహేష్ గీతా ఆర్ట్స్ మూవీకి చాలా కలిసొస్తుందని మహేష్ చెప్పుకొచ్చాడు.

దీంతో ప్రశాంత్ నీల్‌ ఈ సినిమాకు డైరెక్టర్‌గా పనిచేస్తాడా లేడా అనేది ఆసక్తిగా మారింది.ఈ సినిమాను వంశీ పైడిపల్లి సినిమా తరువాత ప్రారంభించే అవకాశం ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

మరి గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో మహేష్ ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube